మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటీషన్ దాఖలు చేసింది.
శివసేన చీఫ్ విప్ సునిల్ ప్రభు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 16 మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకొనే వరకు ఈ సస్పెన్షన్ ను కొనసాగించాలని ఆ పిటిషన్ లో శివసేన ఆ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పెండింగ్లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆ కేసులో జూలై 11న విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది.
ఈ నెల 29న రాత్రి ఏడున్నర గంటలకు ఏక్నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. రేపటి నుండి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో శివసేన ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు