telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన…సయ్యద్ మృతి

ఆదిలాబాద్‌ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న సయ్యద్ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందాడు. ఇటీవల జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో మొతేషీన్ నడముులోకి ఒక తూటా దూసుకుపోగా, సయ్యద్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సయ్యద్ మృతి చెందాడు. ఇది ఇలా ఉండగా… ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఎంఐఎం అధినేత ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసారు.

Related posts