ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని వరల్డ్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల స్పందించారు. వరల్డ్ బ్యాంక్ రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయన అన్నారు. అమరావతిపై కొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు కోరిందని తెలిపారు.
దేశం వెలుపల ఉన్న సంస్థ ఇక్కడ ఎలా విచారణ జరుపుతారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ కారణం వల్లే అమరావతికి నిధులు ఇచ్చే అంశంలో ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించేవారని యనమల పేర్కొన్నారు.