కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పథకం మార్చి 30 నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్ పేర్కొన్నారు.
కరోనా రోగుల వైద్య సవలో నిమగ్నమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలోని 22.12 లక్షల మందికి బీమా రక్షణ లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది వాటి బారిన పడే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.