telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

విహారయాత్రలో విషాదం..కేరళలో తెలంగాణ విద్యార్థి మృతి

New couples attack SR Nagar

కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్‌కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న కళాశాలకు చెందిన 60 మంది విద్యార్థులు టూర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొట్టాయం వద్ద మర్రి మాల్ జలపాతం వద్ద హర్ష ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. వెంటనే జాలర్లు రంగంలోకి దిగి శ్రీహర్ష మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related posts