telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అంబులెన్స్ లు అపడంపై తెలంగాణ సర్కార్ పై ఏపీ ఆగ్రహం

బార్డర్ లో అంబులెన్స్ లు అపడంపై తెలంగాణ సర్కార్ పై ఏపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ లను సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయటంపై న్యాయపరంగా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టు లను ఆశ్రయించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాల కోవిడ్ పేషెంట్లు హైదరాబాద్ లోని హాస్పిటళ్ళ నుంచి అడ్మిషన్ ఖరారు అయినట్లు నిరూపిస్తేనే వాహనాలు అనుమతిస్తామని విధివిధానాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులతో పాటు న్యాయపరమైన హక్కుల ప్రత్యామ్నాయాలు చూస్తున్నది ఏపీ సర్కార్.

Related posts