శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ కు ఛాతీనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు.
ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు తెలిపారాని, తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.