telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా వైరస్ తో వృద్ధుడు మృతి

Etala Rajender

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైద్రాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైయరస్ తో వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో మృతి చెందిన తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. తెలిపారు.

తెలంగాణలో 65 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చినవాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి భోజన కేంద్రాలు, వసతి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

Related posts