ఓటు దొంగలు ఉన్నారు.. ప్రజలంతా ఓటును పరిశీలించుకోండని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఫామ్-6 దాఖలు చేసేందుకు ఇదే చివరి రోజని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీఒక్కరూ తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని కోరారు. సైబర్ నేరస్తులు, ఓటు దొంగలు ప్రజల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరంతా టెక్నాలజీ సాయంతో గతంలోలాగే ఇప్పుడూ ప్రజల ఓట్లను తీసేస్తున్నారని విమర్శించారు.
ప్రజలంతా తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విభజన హామీల అమలులో మోసాలు, కుట్రలు, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కీలకదశలో ఉన్న క్రమంలో ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అని ట్విటర్ లో పేర్కొన్నారు.
న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే