telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలి : సీఎం జగన్

cm jagan ycp

ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా నియంత్రణ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి. అలాగే ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి అని తెలిపారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి. టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలి అని తెలిపారు. కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. కోవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో సీసీసీలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో సేవలందిస్తారు అని అన్నారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌ కేర్, వైద్యుల అందుబాటు.. ఈ అయిదూ తప్పనిసరి ఉండాలి. తగినంత ఆక్సీజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టండి. కేంద్రం కేటాయింపుతో పాటు, ప్రత్యామ్నాయం పైనా దృష్టి సారించండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్.

Related posts