telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవినేని సీతారామయ్య కన్నుమూత..విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

chandrababu

హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీరామారావు గారికి దేవినేని సీతారామయ్య అత్యంత సన్నిహితుడని, తనకు మార్గదర్శి అని పేర్కొన్నారు.

ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో సంభాషించిన మధురక్షణాలు ఉన్నాయని, ఆయనతో మాట్లాడడం ద్వారా నేర్చుకున్న అనేక పాఠాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని వివరించారు. నారా కుటుంబం ఆయనను మిస్ అవుతోందని ట్వీట్ చేశారు.

Related posts