telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా

Kanna laxminarayana

కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజధాని అంశంపై మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీ, రేపు హైపవర్ కమిటీ అంటూ సమయం, ధనం వృథా చేస్తున్నారని అన్నారు.

కమిటీ పేరు ఏదైనా, జగన్ మనసులో ఉన్నదే నివేదికలో ఉంటుందని చెప్పారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నివేదికలను ఇస్తూ, గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నాతో పాటు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts