ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్కల్యాణ్ దీక్షకు దిగారు.
ఈ క్రమంలో పవన్ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. ముగింపు సభకు హాజరవుతానని పవన్కల్యాణ్ చెప్పారని అమరావతి ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు.
తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు. అన్నిపక్షాల మద్దతుతో అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కాపాడుకుంటామని మహిళలు ధీమా వ్యక్తం చేశారు.
అయితే తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాలని తలపెట్టగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించారని ఆరోపించారు. సభకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.
మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. వారి పాదయాత్ర 42వ రోజుకు చేరింది. అంజిమేడులో ప్రారంభమైన యాత్ర.. గుత్తివారిపల్లె వరకు కొనసాగింది. ఎన్ని కష్టాలు ఎదురైనా అమరావతి రైతులు పాదయాత్రను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక నాపై కేసులు: జగన్