telugu navyamedia
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్

narendra-modi

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, నివారణ చర్యలు, కరోనా టెస్టింగ్ లు తదితర అంశాలపై కేసీఆర్, జగన్ లతో మాట్లాడారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ ప్రధాని ఫోన్ ద్వారా సంభాషించారు. బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతోనూ కరోనా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని మోదీ తెలిపారు.

Related posts