telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

Road accident 8 dead and 30 injured

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యపేట జిల్లాలోని కోదాడలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Related posts