తాగునీటి సమస్య ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. నీళ్లు పట్టుకునేందుకు కుళాయి వద్ద క్యూల్లో నిల్చున్న మహిళల మధ్య ఘర్షణ వల్ల మహిళ మరణించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట పల్లె వీధిలో జరిగిన ఈ దారుణం చోటు చేసుకుంది. నల్లా దగ్గర నీళ్లు పట్టుకునే విషయమై మహిళల మధ్య వాగ్వాదం జరిగింది.చిన్నపల్లి వీధిలోని తాటిపూడి పద్మ (38) మంచినీటి కోసం క్యూలో నిల్చుంది. అదే సమయంలో మరికొందరు మహిళలు నిల్చున్నారు.
క్యూలో ముందూ వెనుకవుతున్నారన్న అంశంపై తొలుత మహిళ మధ్య మాట యుద్ధం మొదలయ్యింది. కాపేపటికి ఘర్షణగా మారింది. దీంతో మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి సరస్పరం బిందెలతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ తలపై బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.