“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో ప్రారంభమయ్యింది. కాశ్మీర్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లో షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ ట్రైన్ సెట్ను అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో రెడీ చేస్తున్నారట. ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “సరిలేరు నీకెవ్వరు” సినిమా సినిమాటోగ్రాఫర్ను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఆ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అలియాస్ రాండీ. దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ అకౌంట్లో రత్నవేలుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ “మీతో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది సార్” అంటూ మెసేజ్ను కూడా పోస్ట్ చేశారు. గతంలో మహేష్ బాబు నటించిన `1 నేనొక్కడినే`, `బ్రహ్మోత్సవం` సినిమాలకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.
previous post