మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా మంచు లక్ష్మి రాంచరణ్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మెగాపవర్ స్టార్ రామ్చరణ్తో కలిసి తన కుమార్తె యాపిల్ దిగిన ఫొటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా… “చరణ్, యాపిల్ కలిసి ఉన్న ఈ ఫోటో చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. చరణ్… నేను మీ డాడీతో కలిసి ఇలాంటి ఫోటోనే దిగా. ఈ ఫోటో చూస్తుంటే జీవితం మళ్లీ ప్రారంభమైన చోటుకే వచ్చినట్టు అనిపిస్తోంది. మనది చాలా అద్భుతమైన జర్నీ. మన స్నేహం ఇలాగే మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి. నీకు పిల్లలు పుట్టిన తర్వాత యాపిల్ వాళ్లకి పెద్ద అక్కగా ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్కు నీకు స్వాగతం” అంటూ పోస్ట్ చేశారు మంచు లక్ష్మీ. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబాల మధ్య చిరకాలంగా అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరి కుటుంబ సభ్యులు, పిల్లల మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది. మెగా కుటుంబంతో తన అనుబంధాన్ని ఈ ఫోటో ద్వారా మంచు లక్ష్మి తాజాగా గుర్తు చేసుకున్నారు.
previous post
next post