telugu navyamedia
Uncategorized క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న పంజాబ్…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో 31 వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ షార్జాలో జరుగుతుండటంతో పరుగుల వరద మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇక పంజాబ్ విధ్వంసక ఆటగాడు గేల్ కూడా బరిలోకి దిగుతుండటంతో పంజాబ్ కు బలం పెరిగింది అనే చెప్పాలి. అయితే ఇంతకముందు ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు పంజాబ్ భారీ విజయం నమోదుచేసింది. మరి ఇప్పుడు వరుస పరాజయాలతో ఉన్న పంజాబ్ వరుస విజయాలతో ఉన్న బెంగళూరు పై విజయం సాధిస్తుందా… లేదా అనేది చూడాలి.

బెంగళూరు : దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ : క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హూడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్

Related posts