telugu navyamedia
రాజకీయ వార్తలు

వారికి భారత పౌరసత్వం ఇవ్వాలి: మన్మోహన్‌

Congress manmohan

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసకు గురవుతున్న మైనార్టీలకు ఉదారభావంతో భారత పౌరసత్వం ఇవ్వాలని మ‌న్మోహ‌న్ సింగ్ డిమాండ్ చేశారు. 2003లో రాజ్యసభలో కాంగ్రెస్‌ తరపున సభాపక్షనేతగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోను ఇవాళ బీజేపీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఈ చట్టంపై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పిన మాటలనే అప్పట్లో మన్మోహన్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts