telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బాబు ఆ ఎజెండాతో తుపాకీ పట్టుకు తిరుగుతున్నాడు : విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు‌ పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. “ఫలానా పథకం ప్రవేశపెట్టండి, డ్యాములు కట్టండి, రోడ్లు వేయండని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. చంద్రబాబు మాత్రం ఇంకే సమస్యలు లేనట్టు తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రాజధాని అక్కడే ఉంచాలన్న సింగిల్ ఎజెండాతో తుపాకీ పట్టుకు తిరుగుతున్నాడు.” అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతకుముందు సీఎం జగన్ పాలనను మెచ్చుకుంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసాడు. “ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల. ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద 31.97 కోట్లు విడుదల. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.” అని సీఎం జగన్ ను పొగిడారు విజయసాయిరెడ్డి.

Related posts