ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అందుతున్న వివరాల ప్రకారం హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్ లోని స్నేహితురాలి నివాసంలో ఈ సాయంత్రం ఆమె స్పృహ తప్పి పడిపోయారని చెపుతున్నారు. మరోవైపు ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఘటన జరిగిన వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు.అయితే, ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్