తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.వరంగల్ జిల్లా తొర్రూరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక కనుమరుగు కాబోతోందని పేర్కొన్నారు.
రోజుకో ఎమ్మెల్యే, రోజుకో సీనియర్ నాయకులు పార్టీ మారుతుంటే ఢిల్లీ నాయకులు వణికిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని అన్నారు.
ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది