పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో పెరిగిపోతోన్న ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఈ రోజు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్న విషయంపై నేను చాలా ఆందోళన చెందుతున్నానని తెలిపారు. మరో వైపు జామియా యూనివర్సిటీలో విద్యార్థులు ఈ రోజు కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు
. రోడ్డుపై బైఠాయించి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ నగరంలో వెంటనే తిరిగి శాంతియుత వాతావరణం తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరానని కేజ్రీవాల్ తెలిపారు.
కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం నచ్చలేదు: పోసాని