telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరో దారుణం..హర్యానాలో నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని..ఓ వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో పాటు వచ్చిన ఇంకో వ్యక్తి ఇందుకు సహకరించాడు. అయితే యువతీ నిందితున్ని ప్రతిఘటించింది. దీంతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి ఇద్దరు పారిపోయారు. ఈ విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు తౌఫిక్ అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడిపై 2018 కిడ్నాప్ కేసు వేసింది బాధితురాలి కుటుంబం. అయితే అది చర్చలతో ముగియడంతో అంతటితో వదిలేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత యువతీ ప్రాణాల పైకే వచ్చింది. కాగా ఈ దారుణ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. అటు నెటిజన్లు స్థైతం ఫైర్ అవుతున్నారు.

Related posts