హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొత్తరకం గంజాయి దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. బంగారు భవిష్యత్తు గల యువకులు గంజాయికి బానిసగా మారి మత్తులో జోగుతున్నారు. టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా రెచ్చిపోతోంది. హైదరాబాద్లో ఈ ముఠా బారిన పడిన ఎందరో టీనేజర్లు గంజాయి మత్తులో జోగుతున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న స్మగ్లర్లు బరితెగిస్తున్నారు.
హైదరాబాద్లో కొత్తరకం గంజాయి దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంలో చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్తో పాటు ఇద్దర్ని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బిర్యాని ఫుడ్ కలర్ బాటిల్స్, తేనె బాటిళ్లలో ముఠా అమ్ముతోంది. విశాఖ నుంచి లిక్విడ్ గంజాయి తెచ్చి ముఠా సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబుకు బుద్ధి రాలేదు: రోజా