మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే వివేకా మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు సమాచారం.
అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వివేకా మృతి దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేశారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ