telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అలాంటి వ్యాఖ్యలు చేయద్దు.. నటుడు పృథ్వీ పై సీఎం జగన్ ఫైర్!

Comedian-Prudhvi

నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యల పై సీఎం ఘాటుగా స్పందించారు. కులాలను ప్రస్తావించడం సరికాదని చెప్పినట్టు తెలుస్తోంది.

ఏదైనా సమస్య గురించి మాట్లాడాల్సి వస్తే.. కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడాలని సూచించినట్టు తెలుస్తోంది. కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరూ ఇలా మాట్లాడొద్దని నేతలను ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతులపై పృథ్వీ ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Related posts