భారత్-బంగ్లా మధ్య జరుగుతున్న డే-నైట్ టెస్టులో భారత సారథి విరాట్ కోహ్లీ* అర్ధశతకం సాధించాడు. ఇబాదత్ బౌలింగ్లో బౌండరీ బాది 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీతో పాటు రహానె (11*) ఉన్నాడు. 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పుజారా (55)తో కలిసి కోహ్లీ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.
ఇబాదత్ బౌలింగ్లో షాట్కు యత్నించి పుజారా షెద్మాన్ చేతికి చిక్కడంతో 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం బంగ్లా కంటే 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది.
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదు: చంద్రబాబు