telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో ట్వీట్లతో రెచ్చిపోతున్న వైసీపీ-బీజేపీ నాయకులు…

పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికలో ఏపీకి సీఎం ని చేయాలనీ బీజేపీ అధ్యక్షుడు సొమ్ము వీర్రాజు పేర్కొన విషయం తెలిసిందే. అయితే దీని పై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందిస్తూ… ”తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు.  ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం  మళ్లీ వైసీపీనే  దీవిస్తారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థులే చేతులెత్తేస్తుంటే వారికి జాకీలుపెట్టి ఎలా లేపాలో అర్థంకాక సతమతమవుతోంది పచ్చ కుల మీడియా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మీరెన్ని చేసినా డిపాజిట్లు వస్తే చాలాఎక్కువ” అని అన్నారు. ఇక దీనికి మళ్ళీ సొమ్ము వీర్రాజు కౌంటర్ వేస్తూ ”మా ఊసు ఎందుకులే ఎంపీ విజయ సాయి రెడ్డి గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో  తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అని పేర్కొన్నారు.

Related posts