ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. గత కాలపు తుగ్లక్ కంటే జగన్ ఎంతో ఫేమస్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. బిల్లులు చెల్లించకపోవడాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కూడా తప్పుబట్టిందని పేర్కొన్నారు. ఇదే అంశంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని ప్రస్తావించారు. జపాన్ కూడా ఇప్పటికే తీవ్ర పదజాలంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు.
పెట్టుబడిదారులు సైతం బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని, పీపీఏల పునరుద్ధరణకు కొత్త ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసి, ఒప్పందాలకు న్యాయపరమైన రక్షణ కల్పించాలంటూ కేంద్రంపైనా ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదని విమర్శించారు.