తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
సంజయ్ ను తరలిస్తోన్న వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా దానికి అడ్డంగా బీజేపీ కార్యకర్తలు పడుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు సంజయ్ ను పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ విషయంపై బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. “తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్ని నిర్బంధాలు విధించినా కార్యకర్తలు ఛేదించుకొని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు”. ఛలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమైందని ఆయన ట్వీట్ చేశారు