telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కోల్‌కతా లో శ్యామ్ సింగరాయ్…

Nani

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే నేని చేస్తున్న సినిమాలలో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాక్సీవాల దర్శకుడు రాహుల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అల్యుమినియం ఫ్యాక్టరీల్లో చేశారు. ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ కోసం కోల్‌కతా వెళ్లారంట. అక్కడ నాని, సాయి పల్లవి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంట. ఇందులో ఇతర కీలక నటులు కూడా పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే నాని ఈ సినిమా తరువాత అంటే సుందరానికి సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల నాని పూర్తి చేసుకున్న టక్ జగదీష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చుడాలిమరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts