telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పారిశ్రామిక రంగంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం

పారిశ్రామిక రంగంపై ఏపీ సీఎం జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని పునరుద్ఘాటించారు. ఈ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవవనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్లే రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వగలమని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు అనిల్ కుమార్, బొత్స, లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts