మహారాష్ట్రలో కరోనా పెరుగుదలకు ఉద్ధవ్ ప్రభుత్వమే కారణమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. దేశంలో ఉన్న మొత్తం కరోనా రోగుల్లో 36 శాతం మహారాష్ట్రకు చెందిన వారేనని అన్నారు. దీనికంతా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ముంబైలో కరోనా బాధితులకు ఆసుపత్రులు, అంబులెన్సులు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. రోడ్లపైనే రోగులు మరణిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఫడ్నవిస్ విమర్శించారు. ముంబై నగరంలో లాక్ డౌన్ ఉల్లంఘన జరుగుతోందని చెప్పారు. రేషన్ కార్డులున్న కోట్లాది మందికి మార్చి, ఏప్రిల్ మాసంలో రేషన్ లభించలేదని తెలిపారు.