telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై బీజేపీ మహిళా ఎంపీ సరోజ్‌ పాండే ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌లో ఇటీవల కొంత పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ఎంపికైనా సరోజ్ పాండే గతంలో రాహుల్ ను జోకర్, పప్పు అని విమర్శించిన సంగతి తెలిసిందే. అటువంటి సరోజ్ పాండే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఇప్పుడు రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేతగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఆయన చర్యలే ఆయన పరిణితి చెందిన నేతగా మారాన్న సంకేతాలు ఇస్తున్నాయని సరోజ్ పాండే అన్నారు. కాగా గతంలో వ్యాపం స్కాంను రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ భుజాలకెత్తుకుందని, ఇది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో విపక్షాలు రాఫేల్‌ స్కాంను తెరపైకి తెచ్చాయని సరోజ్‌ పాండే ఆరోపించారు.

Related posts