భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల తిరుమల పర్యటన సంధర్బంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. సాయంత్రం తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి గారు స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకుంటారు.ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్రపతి తిరుమలకు చేరుకుని తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్:
ఈ రోజు సాయంత్రం 5.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
సాయంత్రం 5.45 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.
6.15 గంటలకు శ్రీకపీలేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
రాత్రి 7.05 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిధి గృహం చేరుకుని బస చేస్తారు.
ఆదివారం ఉదయం 5.40 గంటలకు వరహస్వామిని దర్శించుకుంటారు.
ఉదయం 6.00 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 3.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని శ్రీహరికోటకు బయలుదేరి వెళ్లనున్నారు.