ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు చేశారు.ఇంటి నుంచి పనిచేసే అలవాటును మానుకోవాలని, ఉదయం 9:30 గంటలకల్లా కార్యాలయాలకు చేరుకోవాలని ఆదేశించారు. పార్లమెంటు సమావేశాలు జరిగే 40 రోజులూ తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో ఇతర పనులు పెట్టుకోవద్దని సూచించారు.
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు నిర్ణీత సమయానికే చేరుకునేవాడనినని గుర్తు చేశారు. మంత్రులు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక బుధవారం తొలిసారి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మంత్రులకు ఎంపీల మధ్య పెద్దగా తేడాలేదని, ఎంపీలు కలిసేందుకు మంత్రులు కొంత సమయం కేటాయించాలని సూచించారు.