telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సిగ్నల్ జంప్ చేస్తూ బైక్ ను ఢీ కొట్టిన కారు…

తెలంగాణ, హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. క్లబ్ రోగ్ పబ్ లో మద్యం సేవించి ఆ మత్తులోనే సైబర్ టవర్ చౌరస్తా వద్ద తన బెంజ్ కారు తో సిగ్నల్ జంప్ చేసి బైక్ పై వెళ్తున్న భార్య భర్తల ను కారు తో ఢీ కొట్టాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాశీ విశ్వనాథ్. ఆ దంపతుల్లో భర్త గౌతమ్ దేవ్ అక్కడిక్కడే మృతి చెందగా…భార్య శ్వేత కోమ లోకి వెళ్ళింది. ఈ ప్రమాదం పై ఎన్టీవీతో గౌతమ్, శ్వేతా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… ప్రమాదానికి కారణం అయినా వారిని కఠినంగా శిక్షించాలి అని కోరారు.  ఇంకొకరి ఇంట్లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవద్దు అన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ప్రమాదాలు జరగడం దారుణం అని తెలిపారు. పెళ్లి షాపింగ్ ముగించుకొని ఇంటికి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం  శ్వేత పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కాళ్ళు మొత్తం విరిగిపోయాయి. బ్రెయిన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చావు బతుకుల మధ్య పోరాడుతున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యే భాగ్యనగరంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

Related posts