హైదరాబాద్ రాజేంద్రనగర్లో విడాకులు తీసుకున్న భార్యపై కత్తితో భర్త దాడికి యత్నించాడు. అయితే తనపై దాడి చేస్తాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన భార్య లావణ్య పోలీసులకు సమాచారం అందించింది. లావణ్య, సాయికిరణ్ విడాకులు తీసుకున్నారు.
లావణ్య బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సాయి కిరణ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా లావణ్యపై సాయి కిరణ్ కత్తితో దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.