telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టీ20 సిరీస్ : .. ధోనీ ని దాటేసిన .. పంత్ .. భారత్ క్లీన్ స్వీప్ ..

panth high score as wicket keeper in t20

వెస్టిండీస్‌తో మూడో టీ20లో పంత్‌(65 నాటౌట్‌) అర్ధశతకంతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రికార్డును యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ బ్రేక్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే గతంలో ధోనీ పేరిట ఉన్న రికార్డును తాజాగా పంత్‌ అధిగమించాడు. 2017లో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో టీ20లో ధోనీ 56 రన్స్‌ రాబట్టి ఈ ఘనత సాధించాడు. సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ధోనీ చేసిన హాఫ్‌సెంచరీ(52) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

మొదటి రెండు మ్యాచ్‌ల్లో తప్పుడు షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్న పంత్ మూడో మ్యాచ్ లో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు.వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా చివరిదైన మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.

Related posts