జాతీయ భద్రతకు విఘాతం కలిగించాడనే ఆరోపణలపై ఆర్మీ జవాన్ రవీందర్ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ వినోద్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫేస్బుక్లో ఓ యువతితో చాటింగ్ చేస్తూ, రక్షణ వ్యవహారాలు, ఆర్మీ ఉపయోగిస్తున్న తుపాలకు గురించిన ఫోటోలు ఆమెతో షేర్ చేసుకున్నాడని తెలిపారు. దీనికి ప్రతిఫలంగా యువతి నుంచి డబ్బు తీసుకున్నట్లు రుజువైందని పేర్కొన్నారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన పోలీసులు రవీందర్ను రెండు రోజుల రిమాండ్కు తరలించారు.
previous post
next post
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం లేదు: రేవంత్ రెడ్డి