telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ–జనసేన కలిసే పోటీ చేస్తాయి: బీజేపీ ఎంపీ జీవీఎల్​

gvl comments on tdp

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘బీజేపీ–జనసేన’ కలిసే పోటీ చేస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సరైన సమయంలో ఎన్నికల ప్రణాళిక గురించి రెండు పార్టీలు ముందుకెళతాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీం కోర్టు సమర్థించడంపై స్పందించారు. ఢిల్లీలో తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరైనా స్వీకరించాల్సిందేనని అన్నారు.

ఆర్టికల్ 243 కె ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలనే సుప్రీంకోర్టు చాటిచెప్పిందని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డ కారణంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆపేందుకు వీలు లేదనానరు. వాటిని కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts