telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బన్నీ సినిమాతో కొరటాల మరో మెసేజ్ ఇవ్వనున్నాడా…?

AA21

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అడవుల నేపథ్యంలో తెరకెక్కితున్న కారణంగా ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రిస్తున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీరిద్దరి సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత వీరి కాంబోలో రానున్న సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలెట్టారట. అయితే ఈ సినిమా కాన్స్‌ప్ట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొరటాల శివ సినిమా అంటేనే సమాజానికి ఓ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆయితే ఈ సినిమా కూడా ఓ మెసేజ్ ఇస్తుందంట. ఈ సినిమాలో మంచి నీటికి సంబంధించిన అంశంపై కథ నడుస్తోందని టాక్ నడుస్తోంది. కొద్దిరోజుల్లోనే కొరటాల-బన్నీ సినిమా అప్డేట్ రానుందని సమాచారం. అయితే ఆలు అర్జున్ పుష్ప మాత్రం ఆగస్టు 13 న అభిమానుల ముందుకు రానుంది.

Related posts