telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘పోలవరం’ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ప్రభుత్వం సిద్దం!

Polavaram-Project

పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పరిధిలోని దేవీపట్నంలో ఉన్న ఆరు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కింద రూ.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాకాలం నాటికి దేవీపట్నం మండలంలో 6 గ్రామాల ప్రజల తరలింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ నిన్న సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతేడాది వరదలకు కాఫర్‌ డ్యామ్‌ కారణంగా గ్రామాలు నీట మునిగాయి. బాధిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Related posts