రాజధాని ఎక్కడికీ తరలిపోదని, వెలగపూడిలోనే ఉంటుందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల పోరాట పటిమ చూస్తే 100 రోజులైనా రాజధానిపై స్పష్టత వచ్చే వరకు రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని రాయపాటి పేర్కొన్నారు.
రైతు జేఏసీ ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, రేపు ప్రధాన మంత్రిని కలవనున్నారని చెప్పారు. ప్రధాని మోదీని కలిశాక రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.