telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను తరిమికొడతారు..

Jeevanreddy trs Mla

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎంపీ అరవింద్ రైతులను మోసం చేసాడని… కేటీఆర్ నుద్దేశించి అరవింద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ మాట్లాడినందుకు దూషిస్తున్నారని.. బీజేపీ ప్రభుత్వంలో అన్నీ అమ్మేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తండ్రికి గౌరవం ఇవ్వలేని సంస్కార హీనుడు అరవింద్ అని… నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను తరిమికొడతారని హెచ్చరించారు. తెలంగాణ కోసం జన్మించిన కుటుంబం కేసీఆర్ ది అని.. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినవారి గతి ఏమైందో ఆలోచించాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు జీవన్‌ రెడ్డి. కాగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతోంది.

Related posts