telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసులో దోషులను సీబీఐ కచ్చితంగా పట్టుకోవాలి : అనుపమ్ ఖేర్

Anupam kher

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురిని ఈడీ విచారించింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రెండుసార్లు ఈడీ ముందు హాజరై కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రియా అకౌంట్లోకి సుశాంత్ కు సంబంధించిన సొమ్ము చేరలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు న్యాయం జరగాలని అతడి అభిమానులు, ఇతర నటీనటులు కోరుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సుశాంత్‌ కేసులో దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఓ ట్వీట్ చేశారు. ‘సహ నటుడిగా, సినీ పరిశ్రమలో ఓ సభ్యుడిగా సుశాంత్‌కు, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను. ఓ గొప్ప నటుడు అన్యాయంగా మరణించడం కలచి వేస్తోంది. ఈ కేసులో దోషులను సీబీఐ కచ్చితంగా పట్టుకోవాలి. కేసుకు సరైన ముగింపునివ్వాలి. అది మాత్రమే సుశాంత్ కుటుంబానికి స్వాంతన కలిగిస్తుంది’ అని అనుపమ్ ఖేర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts