telugu navyamedia
సినిమా వార్తలు

రాధేశ్యామ్‌ రిలీజ్‌..థియేటర్ వద్ద అపశృతి..

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించినరొమాంటిక్ ల‌వ్ స్టోరీ చిత్రం ‘రాధే శ్యామ్’ .  ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న  “రాధేశ్యామ్” ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి శుక్రవారం విడుదల‌వ‌డంతో  థియేటర్ల  వ‌ద్ద‌ ఫుల్ గా సందడి నెలకొంది.

Makers of Prabhas-starrer 'Radhe Shyam' plan massive event with 40,000 fans | Entertainment News – India TV

ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి రావ‌డంతో ఫ్యాన్స్ ర‌చ్చ మామూలుగా లేదు. థియేటర్స్ వ‌ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదం కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద గురువారం రాత్రి జరిగింది.

Prabhas's Radhe Shyam postponed, makers say film will definitely be released in theatres

థియేటర్‌ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్‌ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి కూడా గాయాలైనట్టు సమాచారం. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

Related posts