పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించినరొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం ‘రాధే శ్యామ్’ . ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న “రాధేశ్యామ్” ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి శుక్రవారం విడుదలవడంతో థియేటర్ల వద్ద ఫుల్ గా సందడి నెలకొంది.
ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి రావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. థియేటర్స్ వద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద గురువారం రాత్రి జరిగింది.
థియేటర్ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి కూడా గాయాలైనట్టు సమాచారం. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.