సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మరో వీడియో రిలీజ్ చేశారు. బైక్ రేసింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ నరేశ్ ఈ రోజు ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. ఈ విడియో వివాదస్పదం కావడంతో ఆయన మరోసారి వివరణ ఇస్తూ సాయంత్రం వీడియో విడుదల చేశారు.
ఆ వీడియాలో నరేశ్ మాట్లాడుతూ.. నేను పొద్దున్నే సాయి దరమ్ తేజ్ గురించి ప్రార్ధించాను,. ఆయన చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతున్నాడని.. త్వరలో సాధారణ స్థితికి వస్తాడన్నాడు. దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది..వీళ్ళద్దరూ కలిసి వెళ్ళడం వాస్తవమేనని, ఓ చాయ్ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ తర్వాత ఎవరికి వారు ఇండ్లకు వచ్చే క్రమంలో.. సాయి దరమ్తేజ్ నార్మల్ స్టేజ్ ..
ఆ సమయంలో తేజ్ 60-70 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నప్పుడు లెప్ట్కు తిరిగి నప్పడు అక్కడ ఉన్నటువంటి మట్టి కారణంగా తేజ్ ప్రమాదానికి గురయ్యాడు.అది సీసీ టీవీ ఫుటేజీ చూస్తే స్పష్టం అవుతోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. కేవలం ప్రమాదం మాత్రమే. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఆలోచన లేదు. సాయితేజ్ క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉందని, తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని నరేశ్ వీడియోలో తెలిపారు.
టాప్ లెస్ ఫోజు మీకు నచ్చిందా… కొత్తగా ఉంటుందని ట్రై చేశా…